ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ‘స్త్రీ శక్తి’ పథకం ప్రారంభం.

ఆగస్టు 15, 2025 — విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ వద్ద, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘స్త్రీ శక్తి’ పథకం కింద ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించనున్నారు.

సీఎం ఉండవల్లి నుంచి బస్సులో ప్రయాణించి, తొలి “జీరో ఫేర్ టికెట్” ను ఒక మహిళా ప్రయాణికురాలికి స్వయంగా అందజేస్తారు.

అనంతరం, ఈ పథకం అమలుకు సూచికగా ఐదు బస్సులకు జెండా ఊపి ప్రయాణం ప్రారంభిస్తారు.

‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా రాష్ట్రంలోని 2.62 కోట్ల మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్‌లు పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ వంటి బస్సుల్లో తమ గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.

ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి సుమారు ₹1,942 కోట్ల వ్యయాన్ని భరించనుంది.